ఏలూరులో వైసీపీకి షాక్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏలూరులో కీలక నేతలు జంప్ అయ్యారు. ఏలూరు నియోజకవర్గంలో… నగర మేయర్ నుజ్జహన్ అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు… తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే.. ఏపీలో వైసిపి పార్టీ ఓడిపోయి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది.

jagan

ఇలాంటి నేపథ్యంలో.. ఏలూరులో వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం జరిగింది. ఈనెల 27వ తేదీన ఉండవల్లి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్… సమక్షంలో ఏలూరు నేతలు… టిడిపి కండువా కప్పుకోబోతున్నారు. ఈ మేరకు చర్చలన్నీ పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యే బడేటి చంటి తో… వైసీపీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాదు నగరపాలక సంస్థకు చెందిన 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో వైసిపి పార్టీ… దిక్కుతోచని పరిస్థితిలో నెట్టివేయబడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version