నేడు చీరాలకు సీఎం చంద్రబాబు.. చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఇవాళ చేనేత దినోత్సవం కాబట్టి… చీరాల నేతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు కూడా సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు.ఇందులో భాగంగానే చేనేత సదస్సులో ఇవాళ పాల్గొంటారు.

ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు చీరాలకు చేరుకోనున్నారు నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ఏపీ చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా 25 వేల ఉద్యోగాలకు ఆమోదం కూడా తెలుపనున్నారు నారా చంద్రబాబు నాయుడు. 26 సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ కూడా అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. 8వ తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాల పథకాన్ని కూడా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు చీరాల పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version