ఏపీ వరదలు..చంద్రబాబు కోసం ప్రపంచ బ్యాంకు అధికారులు !

-

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్ తో కూడా సమావేశమయ్యారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వరదలు కరువు నివారణ చర్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు మైక్ వెబ్‌స్టర్.

State Minister Kondapalli Srinivas met with eminent persons from various fields in New York

చిత్తూరు జిల్లాలో తాము చేపట్టిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారాన్ని గుర్తుచేసుకున్నారు మైక్ వెబ్‌స్టర్. సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించారు మంత్రి శ్రీనివాస్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందించేందుకు పలువురు ముందుకు రావటం పట్ల ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పనితీరును పలువురు కొనియాడటం పట్ల ధన్యవాదాలు తెలిపారు మంత్రి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version