టీడీపీకి జాతీయ పార్టీ హోదా గల్లంతు.. విజయసాయి సంచలన ట్వీట్

-

టీడీపీకి జాతీయ పార్టీ హోదా గల్లంతు అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. టీడీపీ జాతీయ పార్టీ కాదని.. ప్రాంతీయ పార్టీ అని తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం. అయితే టీడీపీకి జాతీయ పార్టీ హోదా గల్లంతు కావడంపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

తెలుగుదేశం ‘జాతీయ పార్టీ’ అని అధికారిక పార్టీ వెబ్ సైట్ లో పెట్టుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబూ? ‘జాతి’ పార్టీ అని మార్చుకో. లేదా తెలుగు డ్రామా పార్టీ అని పెట్టుకో. ఎచ్చులు మానుకో…ఇప్పటికైనా ఉప ప్రాంతీయ పార్టీ అని నిజం ఒప్పుకో అంటూ ట్వీట్‌ చేశారు.

క్షుద్ర పూజలు చేసి వక్రబుద్దిని వరంగా పొందారు నువ్వు, నీ బాబు. అరాచక, అసురపాలన అంటే మీదే బోకేశా. అందుకే ప్రజలు మీ రాక్షస పాలనకు చరమగీతం పాడి రాజన్నరాజ్యం కోసం జగన్ గారికి పట్టం కట్టారు. భామాకలాపాలతో కళ్ళు మూసుకుపోయి నిజం తెలుసు కోలేకపోతున్నావు పప్పూ అంటూ మరో ట్వీట్‌ లో రెచ్చిపోయారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version