టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు అదిరిపోయే గుడ్ న్యూస్. టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు మోడీ సర్కార్ కీలక పదవి ఇచ్చింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ చైర్మన్ హోదాలో ఆయన రాష్ట్రంలో పర్యటించి ధాన్యం సేకరణ, ఆహార పదార్థాల నాణ్యత, కొనుగోలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. ఎఫ్ సి ఐ ఏపీ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.