అమెరికాలో మరోసారి తుపాకీ మోత.. కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

-

ఉన్నత చదువు కోసం, ఉద్యోగాల కోసం కన్నవాళ్లను, పుట్టిన ఊరును చివరకు దేశాన్ని విడిచి ఎంతో మంది యువత విదేశాల బాట పడుతున్నారు. అక్కడ భవిష్యత్ కు బంగారు బాట వేసుకోవాలనుకుంటున్న వారు తిరిగి నిర్జీవంగా స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విదేశాలకు వెళ్లిన యువతీయువకులు అక్కడి ప్రమాదాల్లో కొందరు, కాల్పుల్లో మరికొందరు, హత్యకు గురై మరికొందరు మరణిస్తున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇటీవల అమెరికాలో మృతి చెందుతున్న తెలుగు యువత సంఖ్య పెరుగుతోంది.

తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ  రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.  ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో గోపీకృష్ణ పని చేస్తుండగా.. అక్కడ జరిగిన కాల్పుల్లో అతడికి తీవ్రగాయాలవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version