లండన్​లో మహేశ్ బాబు కుమారుడు గౌతమ్​ స్టేజ్ పెర్ఫార్మెన్స్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టనమనేని ఆర్టిస్ట్ అయ్యాడు. గౌతమ్ తన కెరీర్​లో తొలిసారిగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లండన్‌ యూనికార్న్ థియేటర్‌లో గౌతమ్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఈ పర్ఫామెమ్స్ చూసేందుకు మహేశ్ ఫ్యామిలీ లండన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్టు కింద నమ్రత ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది.

‘ఇదొక ప్రత్యేకమైన సాయంత్రం. గౌతమ్ ఘట్టమనేనిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. లండన్ వేదికగా తన తొలి థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ జరిగింది. చాలా బాగా అనిపించింది. లవ్ యూ మోర్ నాన్నా. చిన్నారులంతా ఈ సమ్మర్ ప్రోగ్రామ్​లో పాల్గొని తమతమ టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని ఆకాంక్షిస్తూన్నా. స్పెషల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య సంతోషంగా, హాయిగా అనిపించింది’ అని నమ్రత పోస్ట్​ షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేశ్ వారసుడు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తాడంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version