పుంగనూరులో ఉద్రిక్తత..గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు

-

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత..వాతావరణం చోటు చేసుకుంది. పుంగనూరు అంబేద్కర్ సర్కిల్ లో టిడిపి నాయకులు ధర్నాకు దిగారు. వైసీపీ ఎంపీ.మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు టిడిపి నాయకులు.

Tension in Punganur Go back Peddireddy, Mithun Reddy slogans

అంతేకాదు… గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. 5 సంవత్సరాలు పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు టిడిపి నాయకులు. ఇక అంతకు ముందు తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ అయ్యారు. నేడు మిథున్‌ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్‌ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ఈ తరుణంలోనే తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ… ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు… ఇళ్లులు కూల్చుతున్నారని నిప్పులు చెరిగారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version