అదుపుతప్పి బోల్తా కొట్టిన కారు.. ఇద్దరు మహిళలు దుర్మరణం

-

అదుపుతప్పి కారు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలవ్వగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతులు సామ్రాజ్యం, సులోచనగా గుర్తించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌ను పోలీసులు వెంటనే క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన కారును జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రహదారి భద్రతా నియమ నిబంధనలను తప్పక పాటించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పొలీసులు హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version