తిరుపతిలో సంచలనంగా మారిన హోం స్టేల గ్యాంగ్ వార్..!

-

తిరుపతిలో హోం స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోంస్టేల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డెక్కట్ సూట్స్ హోమ్ స్టే, నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి పాల్పడింది. డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు స్థానికులు.

ఒక హోం స్టే కు వచ్చే కస్టమర్లను మరో హోం స్టే వాళ్లు లాక్కెల్తున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇక దాడికి పాల్పడిన 7 మందిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో హోం స్టేలోని శ్రీవారి భక్తులు, స్థానిక తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version