Pawan Kalyan: పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు..ఎకరం ఎంతంటే ?

-

జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలోనే ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన అక్కడ స్థలం కొన్నారు. బుధవారం రోజున ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో పవన్‌కల్యాణ్‌ పేరున రిజిస్ట్రేషన్‌ పూర్తయింది.

The land prices have increased drastically in Pithapuram

పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ భూములు కొనడంతో.. అక్కడ ల్యాండ్‌ రేట్లు విపరీతంగా పెరిగాయట. పిఠాపురం టౌన్ లో రోడ్డు ప్రక్కన భూములు రెండు కోట్ల వరకు పలుకుతోందట ఎకరం భూమి. లోపల కి ఉంటే 70 లక్షలు నుంచి కోటి పలుకుతోందట. ఇంతకు ముందు 50 లక్షలు నుంచి కోటి 25 లక్షలు దాటలేదని చెప్తున్నారు స్థానికులు. జాతీయ రహదారి 216 కి సమీపంలో ఉన్న భూములు ఎకరం 3 కోట్లు,లోపల కు ఉన్నవి కోటిన్నర ఉందట. ఇంతకుముందు నేషనల్ హై వే పై కోటి నుంచి రెండు కోట్లు ధర ఉండేదట. పవన్‌ కళ్యాణ్‌ ఫుణ్యమా.. రేట్లు పెరుగుతున్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version