చంద్రబాబు అరెస్ట్ పై సంచలన విషయం వెలుగులోకి..!

-

బీజేపీ ఏపీ అభ్యర్థుల లిస్టు విడుదలయిన విషయం తెలిసిందే. అయితే అనకాపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ సీఎం రమేశ్ ఖరారు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్యాకేజీ డబ్బులు తీసేసుకున్నారని చెప్పారు. ఈ సొమ్ముతో జగన్ చాలా స్కాములు చేశారని ఆరోపించారు. ప్రశ్నిస్తున్నందుకే తమపై బుదరజల్లుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ను బీజేపీ హైకమాండే ఖండించాలని తమకు చెప్పిందని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రానికి మంచిదని సీఎం రమేశ్ పేర్కొన్నారు.

ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా జగన్ పేరు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తొలి నుంచి కూడా విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, కానీ బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే తాను అనకాపల్లిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓ రెండు పార్లమెంట్ సీట్లు రావొచ్చని తెలిపారు. సీఎం జగన్ అండ్ కో ఏదైనా మాట్లాడగలని ఎద్దేవా చేశారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డిని చంపి నానా రకాలుగా మాట్లారని సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లిపైనా దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరూ కోవర్టులేనా అని సీఎం రమేశ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version