నరసరావు పేట ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదు : ఎమ్మెల్యే గోపిరెడ్డి

-

వైసీపీకి నరసరావు పేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు రాజీనామా పై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రాంతీయ పార్టీలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు. నరసరావు పేట పార్లమెంట్ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమేనని.. అందుకే సరసరావు పేట పార్లమెంట్ లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని అధిష్టానం భావించిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎంపీ రాజీనామాతో పార్టీ నష్టం లేదన్నారు. వైసీపీ క్యాడర్ బలంగా పని చేస్తే.. పల్నాడు జిల్లాలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. 

వైసీపీకి నరసరావు పేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన విషయం విధితమే. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవీకి ఆయన రాజీనామా చేశారు.కొంత కాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని.. దానికితాను బాధ్యుడిని కాదని చెప్పారు ఎంపీ. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేడర్ అయోమయానికి గురవుతున్నారని.. దానికి తెరదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news