బ్యూరోక్రాట్స్ పాలన ఉండదు.. రాజకీయ పరిపాలన ఉంటుంది : చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గెలిచిన ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండబోదని.. రాజకీయ పరిపాలన ఉంటుందని చంద్రబాబు అన్నారు. అంతేకాదు.. ఇక నుంచి మారిన చంద్రబాబును చూస్తారని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తన కోసం ఐదేళ్లు కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని భావోద్వేగానికి లోనయ్యారు.

ఎంపీలు అందరూ వచ్చి తరచూ తనను కలవాలని ఆదేశించారు. తనకు ఎంత బిజీ ఉన్నా అందరితో మాట్లాడుతానని మాటిచ్చారు. ప్రతీ సమస్యను స్వయంగా తానే వింటానని.. తానే మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేశారు. మరోవైపు.. ఏపీలో జగన్ వర్గంగా ముద్ర వేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్నారు. వారిని కలిసేందుకు మాత్రం చంద్రబాబు నిరాకరిస్తున్నట్లు సమాచారం. కొందరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version