తిరుమల సర్వదర్శనానికి 06 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. తిరుమల 09 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇక అటు 61004 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

tirumala

20173 మంది భక్తులు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.48 కోట్లుగా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా.. తిరుపతిలోని 4 హోటళ్లను పేల్చేస్తామని.. ఉగ్రవాదులు హెచ్చరించారట. తిరుపతిలో ఉన్న నాలుగు ప్రముఖ హోటల్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయట.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, తిరుపతిలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి నగరంలో నాలుగు హోటళ్ళను పేల్చివేస్తామని మెయిల్ ద్వారా హెచ్చరికలు చేశారటన ఉగ్రవాదులు. అయితే.. ఈ బెదిరింపులు నేపథ్యంలో నగరంలో పోలీసు తనీఖీలు చేస్తున్నారు.  అయితే.. ఉగ్రవాదుల హెచ్చరిక ప్రకారం.. ఎక్కడ ఎమీ ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version