తిరుపతిలోని 4 హోటళ్లను పేల్చేస్తామని.. ఉగ్రవాదుల హెచ్చరికలు !

-

తిరుపతిలోని 4 హోటళ్లను పేల్చేస్తామని.. ఉగ్రవాదులు హెచ్చరించారట. తిరుపతిలో ఉన్న నాలుగు ప్రముఖ హోటల్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయట. దీంతో అప్రమత్తమైన పోలీసులు, తిరుపతిలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి నగరంలో నాలుగు హోటళ్ళను పేల్చివేస్తామని మెయిల్ ద్వారా హెచ్చరికలు చేశారటన ఉగ్రవాదులు.

Bomb threats to hotels inside Tirupati

అయితే.. ఈ బెదిరింపులు నేపథ్యంలో నగరంలో పోలీసు తనీఖీలు చేస్తున్నారు. అయితే.. ఉగ్రవాదుల హెచ్చరిక ప్రకారం.. ఎక్కడ ఎమీ ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. అటు నిన్న స్టార్ ఎయిర్‌లైన్స్ కు బాంబు బెదిరింపు కూడా వచ్చింది. స్టార్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎస్ 5-154 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న మద్యాహ్నం ఎయిర్పోర్ట్ తఖీలు చేసింది భద్రత సిబ్బంది. బెంగుళూరు నుండి తిరుపతి వెళుతున్న విమానంకు బాంబు బెదిరింపు కూడా వచ్చింది. అయితే.. అక్కడ కూడా ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఇక దీనిపై కేసు నమోదు చేసినా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version