తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనాలకు ఎంత సమయం అంటే

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో సర్వదర్శనాలకు చాలా సమయమే పడుతోంది. గత వారం రోజుల నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో… రెండో రోజు టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి… 24 గంటల సమయం పడుతుంది. దీంతో శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.

Another good news for Tirumala Srivaru Update on the food of devotees
Another good news for Tirumala Srivaru Update on the food of devotees

ఇక నిన్న ఒక్కరోజు 75, 104 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 31,896 మంది తిరుమల శ్రీవారికి నిన్న ఒక్కరోజు తలనీలాలు సమర్పించారు. అలాగే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్ను ఒక్కరోజు 3.66 కోట్లుగా నమోదు అయింది.

ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి సన్నిధిలో మరోసారి చిరుత సంచారం చేసింది. అలిపిరి జూ పార్క్ రోడ్డు సమీపంలో చిరుత కనిపించింది. అరవింద్ ఐ ఆస్పత్రి వద్ద… చెక్కర్లు కొట్టింది చిరుత. ఇక ఇది చూసిన తిరుమల శ్రీవారి భక్తులు… భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news