జోగి రమేష్ జోలికి వస్తే… చూస్తూ ఊరుకోం – వెల్లంపల్లి హెచ్చరిక

-

జోగి రమేష్ జోలికి వస్తే… చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పొరపాటే జరిగితే పోలిసులు విచారణ చెయ్యాలని… జోగి రమేష్ ప్రభుత్వ వైఫల్యాల పై ప్రశ్నిస్తారని అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని… తప్పుడు కేసులకు వైసిపి నేతలు ఎవ్వరూ తలొగ్గరని తెలిపారు.

 


జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అమ్మఒడి,రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పథకాల అమలుపై నిలదీస్తారని భయపడి ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు….ఇలాగే ప్రభుత్వ వ్యవహరిస్తే వైసిపి నేతలు తిరగబడే రోజులు వస్తాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. కక్ష సాధింపు చర్యలో భాగంగా జోగి రమేష్ పావుగా మారారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version