తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్‌..గుడివాడ టీడీపీ ఇంఛార్జ్ మార్పు..!

-

తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్‌ కారణంగా టీడీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గుడివాడ, అరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఖరారు చేసింది టీడీపీ. గుడివాడ ఇన్ఛార్జీగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జీగా దొన్ను దొరను నియమించారు చంద్రబాబు.

Venigandla Ramu Appointed As Gudivada TDP Incharge

గుడివాడ టిక్కెట్ ఆశించిన ప్రస్తుత ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుకు భంగపాటు కలిగింది. వెలమ కుటుంబానికి సీటు ఇవ్వకూడదనే తరుణంలోనే.. గుడివాడ ఇన్ఛార్జీగా వెనిగండ్ల రామును నియమించారు చంద్రబాబు నాయుడు. అరకు అసెంబ్లీ సెగ్మంట్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కిడారి శ్రావణ్ కుమార్ ను అరకు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా నియామకం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version