నీతి ఆయోగ్ నివేదిక కాపీ కొట్టి చంద్రబాబు బిల్డప్ : విజయసాయి

-

నీతి ఆయోగ్ నివేదిక కాపీ కొట్టి చంద్రబాబు బిల్డప్ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. ఏడాది క్రితం నీతి అయోగ్ విడుదల చేసిన ‘వికసిత భారత్-2047’ నివేదికను చంద్రబాబు కాపీ కొట్టారని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు.

2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతోందని అందులో నీతి అయోగ్ పేర్కొన్నట్లు తెలిపారు. దీన్ని కాపీ కొట్టి దేశానికి, ఏపీకి తానే దిశా నిర్దేశం చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇక అటు ఎన్నిక ఏదైనా ఫ్యాన్ గాలిదే ప్రభంజనం అన్నారు విజయసాయిరెడ్డి. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో 85 శాతానికి పైగా YSRCP కైవసం. కుప్పంలో ఆరు వార్డు స్థానాలకుగాను ఐదు వశం. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఇదే సంకేతం అని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version