BREAKING : ఏపీ కౌలు రైతులకు గుడ్ న్యూస్…ఇవాళ ఖాతాల్లోకి డబ్బులు

-

BREAKING : ఏపీ కౌలు రైతులకు గుడ్ న్యూస్…ఇవాళ ఖాతాల్లోకి డబ్బులు వేయనుంది ఏపీ సర్కార్‌. ఇవాళ వైయస్సార్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరుసగా ఏడో ఏడాది కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములు సాగుచేసే వారికి రైతు భరోసా నిధులను అందించనున్నారు.

YSR Rythu Bharosa

సిసిఆర్సిలు పొందిన వారిలో అర్హులైన 1,42,693 మంది కౌలుదారులతో పాటు 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లను జమ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా బటన్‌ నొప్పి.. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు సీఎం జగన్‌. అయితే… వైయస్సార్ రైతు భరోసా నిధులను నిన్ననే విడుదల చేయాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version