రేపు సీఎం జగన్ పుట్టపర్తి పర్యటన…YSR రైతు భరోసా నగదు జమ

-

సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు ముముర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 7న అంటే రేపే సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌.

YSR Rythu Bharosa

ఈ సందర్భంగా పుట్టపర్తి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌… వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక అదే రోజున మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇవాళ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం కానున్నారు సీఎం జగన్. జగనన్న సురక్షా క్యాంపైన్ పై కలెక్టర్లతో సమీక్ష చేయనున్న జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version