విడాకులకు సిద్ధమైన మరో సెలబ్రిటీ జంట.. అందుకేనా..?

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీల మధ్య ప్రేమలు, బ్రేకప్ లు , పెళ్లిళ్లు , విడాకులు సహజంగా మారిపోయాయి. ముఖ్యంగా ఎంత సడన్ గా ప్రేమలో పడతారో అంతే బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది సెలబ్రిటీ జంటలు అయితే పెళ్లి చేసుకొని.. పిల్లలు జన్మించిన తర్వాత కూడా కారణాలు చెప్పకుండానే విడాకులు తీసుకుంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇకపోతే ఈ క్రమంలోనే చాలామంది ప్రేమించుకుని విడిపోయేన వారిలో తాజాగా మరొక ప్రేమ జంట బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో టైగర్స్ ష్రాఫ్, దిశా పటాని చాలాకాలంలో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగడం కూడా అందరూ చూసే ఉన్నారు. ఇక వీరు కూడా అధికారికంగా ప్రకటించారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి బ్రేకప్ ను కన్ఫామ్ చేశాడు హీరో టైగర్ ష్రాఫ్.. తాజాగా వీరు ప్రేమ , బ్రేకప్ గురించి ఆయన ఓపెన్ అవ్వడం జరిగింది. ఇటీవల బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షో కి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పాల్గొని వారి వ్యక్తిగత విషయాలను కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ వారు చెప్పకపోయినా సరే ఏదో ఒక విధంగా వారి నుంచి రహస్యాలను రాబడుతూనే వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ షో కి టైగర్ ష్రాఫ్ హాజరవడం జరిగింది. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ కలిసి కరణ్ జోహార్ షో కి హాజరవడం జరిగింది.

ఇక సీజన్ సెవెన్ కి హాజరైన వీరు ఎన్నో విషయాలను కరణ్ తో పంచుకోవడం జరిగింది. ఇక దిశా పటానితో రిలేషన్ గురించి కరణ్ ప్రశ్నించగా టైగర్ ష్రాఫ్ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూనే.. తాను సింగిల్ అని చెప్పాడు. దాంతో వీరి బ్రేకప్ కన్ఫర్మ్ చేశాడు టైగర్ ష్రాఫ్..ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులంతా ఒకసారిగా షాక్ కి గురవడం జరిగింది. ఏది ఏమైనా ప్రేమ పక్షుల్లా తిరిగిన ఈ జంట ఇలా బ్రేకప్ చేసుకోవడం అందరికీ షాక్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version