హైదరాబాద్ లో మరో ఘోర అగ్ని ప్రమాదం

-

హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అగ్ని ప్రమాదాలు కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా నగరంలోని పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ ఉన్న జాకీ గార్మెంట్స్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మదినా సర్కిల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


ఈ ఘటనలో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఘటన స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.ఇటీవలే నాంపల్లి బజార్ ఘాట్ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version