ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి.. సజ్జనార్ ట్వీట్ వైరల్

-

ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. అప్పుల పాలు కావడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. సుచిత్ర బీహెచ్ ఈఎల్ కార్టర్స్‌లో ఉంటున్న రాజ్‌వీర్ సింగ్ ఠాకూర్ (25) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్స్, మద్యానికి బానిసయ్యాడు. అప్పుల తీర్చాలని ఇచ్చినవారు ప్రెజర్ చేయడంతో నిన్నరాత్రి గూడ్స్ రైలు కింద పడి చనిపోయాడు.

ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ..‘ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసై మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ప్రాణత్యాగం సమస్యలకు పరిష్కారం కాదు.అసలు బాధల్లేని మనిషెవరు ఈ భూమ్మీద..చెప్పండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు అందరికీ కష్టాలుంటాయి. తట్టుకుని నిలబడడమే కదా జీవితం అంటే!’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news