నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..3 రాజధానులపై కీలక ప్రకటన

-

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న సమావేశాలలో.. మొదటగా ప్రశ్నోత్తరాల సెషన్‌ జరుగనుంది. తొలి రోజు నుంచే ఏపీ ఉభయ సభల్లో వాడీ వేడీ చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే… మృతి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానాలు చేయనుంది అసెంబ్లీ.

ఇక బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల పనిదినాలు, అజెండా ఖరారు కానుంది. ముఖ్యంగా మూడు రాజధానులపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరుగనుంది. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ సవాల్‌ విసిరింది.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.
ఆర్బీకేలు, ఖరీఫ్‌ పంటనష్ట పరిహరం, ఎస్సీ విద్యార్థుల స్టడీ సర్కిళ్లు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
ప్రమాదకర స్థితిలో శ్రీశైలం ప్రాజెక్టు, గిరిజన సహకార సంఘాలు, రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
రజకులు-దర్జీలు-నాయీ బ్రహ్మాణులకు ఆర్థిక సాయం, పీఎంజీఎస్‌వై బిల్లుల చెల్లింపు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, విదేశీ విద్యా దీవెన పథకం

మండలిలో ప్రశ్నోత్తరాలు..:
పారిశ్రామిక హబ్‌లు, నిత్యావసరాల ధరలు, ఓడరేవులు, ఫిషింగ్‌ హర్బర్లు,

మండలిలో ప్రశ్నోత్తరాలు..:
ఆరోగ్య శ్రీ బిల్లులు, నరేగా పనుల పురోగతి, గండికోట నిర్వాసితుల ఆర్‌ అండ్‌ ఆర్‌.

మండలిలో ప్రశ్నోత్తరాలు..:
డప్పు కళాకారులు, చర్మకారులకు ఫించన్లు, భూముల మార్పిడి

మండలిలో ప్రశ్నోత్తరాలు..:
వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ, మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు

Read more RELATED
Recommended to you

Exit mobile version