ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం… వీటిపైనే చర్చ

-

ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం బ్లాక్ 1 లో భేటీ కానుంది ఏపీ కేబినెట్. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి ఢిల్లీ టూర్ రద్దు కావడంతో… ఏపీ కేబినెట్ సమావేశాన్ని యధా విధంగా  నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోంది ఏపీ సర్కార్.

ఈ కేబినెట్ సమావేశంలో ఖరీఫ్ పంటలపై, అమ్మ ఒడి నిధులపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మూకు మద్దతు ప్రకటించింది వైసీపీ పార్టీ. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు ఇవ్వడం శుభ పరిణామం అని వైఎస్‌ఆర్‌సీపీ వెల్లడించింది. ముందుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్ణయించుకున్నందున ఇవాల్టి రాష్ట్రపతి నామినేషన్‌ కార్యక్రమానికి గైర్హాజరు కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version