ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ : లాప్టాప్ ల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్…

-

ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది కేబినెట్. అలాగే నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం భారీ ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్…9 నుంచి 12 తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాపుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్ట గ్రామంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. విజయనగరంలోని జెఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్శిటీగా మార్చేందుకు అంగీకారం తెలిపిన కేబినెట్… జెఎన్టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారాన్ని తెలిపింది మంత్రి వర్గం.

టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికి, మౌళిక సదుపాయల కల్పన కోసం రూ. 5990 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీకి కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే.. 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు మారిటైమ్ బోర్డుతో సంయుక్తంగా కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. రీ సర్వేలో పట్టాదారులకు ధృవ పత్రాలు జారీ చేసేందుకు ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఆమోదం తెలపగా… విశాఖ నక్కపల్లి వద్ద హెట్రో డ్రగ్స్ సెజ్ కు ఎకరా 25 లక్షల చొప్పున 81 ఎకరాల కేటాయించేందుకు అంగీకారాన్ని తెలిపింది కేబినెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాలను కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది కేబినెట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version