AP : దేవరపల్లి ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

-

ఏపీలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదం జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఆరా తీశారు. దేవరపల్లి మండలం, చిలకావారిపాకలులో జీడిపిక్కల లోడ్‍తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన వారికిమెరుగైన వైద్యసేవలు అందించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version