ఏపీకి 13 మెడికల్‌ కాలేజీలు.. కేంద్రమంత్రితో జగన్‌ భేటీ..

-

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్‌ ఢిల్లీలో మూడు రోజులు ఉండనున్నారు. అయితే ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు జగన్.​ హస్తిన పర్యటనలో భాగంగా నేడు జరిగిన జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. అయితే సీఎం జగన్ ఈ సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో ఏపీకి 13 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version