ఏపీలో మళ్ళీ 10 వేలు దాటిన కేసులు.. 75 మరణాలు !

-

ఏపీలో మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎప్పటి లానే ఈరోజు కూడా కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే కరోనా ప్రభావం మరీ తీవ్రంగా మారిందని చెప్పచ్చు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులను కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 75 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 465730కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4,200 మంది మరణించారు.

ap-corona

ఇక ఏపీలో ఇప్పటివరకు 357829 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 103701 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లోనే 9,499 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. కాగా నిన్న ఒక్క రోజే 62,225 పరీక్షలు చేయగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39,05,775 టెస్టులు చేశారు. ఇక ఏపీ విషయంలో రికవరీ బాగుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version