ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు, ఒక మరణం

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2077942 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 499 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1516 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 95 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2061927 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 28,311 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,14,25,946 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version