ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 483 కేసులు,4 మరణాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 300కు దిగువగా కరోనా మహమ్మారి కేసులు నమోదు కాగా… ఇవాళ అ 400 కు పైగా నమో దయ్యాయి ఈ కరోనా కేసులు. ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 483 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 483 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,61, 287 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 04 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 317 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 534 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,41, 316 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 40, 191 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 90, 56 , 256 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5654 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version