ఏపీ వరదలపై రాహుల్ గాంధీ ట్విట్… బాధితులకు సహాయపడాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు

-

భారీ వర్షాలు, వరదలు రాయలసీమన అతలాకుతలం చేస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా కరువు సీమలో వరదలు భయపెడుతున్నాయి. వాగులు, నదుల ప్రవాహ ధాటికి వంతెనలు కొట్టుకుపోతున్నాయి. వరదల ధాటికి ప్రజలు, మూగజీవాలు కొట్టుకుపోయాయి. వర్షాలు, వరదలుకు కారణంగా 28 మందికిపైగా మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా చిత్తూర్, నెల్లూర్, కడప, అనంతపురం జిల్లాల్లో పలు గ్రామాలు జలధిగ్బందంలో చిక్కుకుపోయాయి. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.

తాజాగా ఏపీలో వరదలపై కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. ఏపీలో వరదల్లో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. భారీ వరదలు ఏపీని తీవ్రంగా నష్ట పరిచాయన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీకు వీలైనంత సాయం చేయాలని ట్విట్టర్ లో కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version