దుబ్బాక ఎన్నికలపై ఏపీ మంత్రి రియాక్షన్…!

-

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. దుబ్బాక, బీహార్ ఎన్నికల ఫలితాల పై స్పందించిన మంత్రి కన్నబాబు… ఎన్నికల ఫలితాలు స్థానికంగా ఉన్న పరిస్థితులు బట్టి ఉంటుంది..ఫలితాలు ఆ విధంగా ఉంటాయి అని ఆయన అన్నారు. సీఎం జగన్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు.. మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు అని ఆయన అన్నారు. జగన్ పనితీరు వలన ఇప్పుడే కాదు, చాలా విడతల ఆయనే సిఎంగా ఉంటారు అన్నారు.

ఇక కొద్దిరోజుల్లోనే ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యకలాపాలు మొదలవుతాయి అని ఆయన వివరించారు. ఎస్.రాయవరం దగ్గర నేవీ చేపట్టిన నిర్మాణం వల్ల పంటపొలాలు ముంపునకు గురయ్యాయి అని… వాటిపై పరిష్కారం సూచిస్తామని తెలిపారు. సాగునీటి వనరులపై ఒక సమావేశం త్వరలో నిర్వహిస్తాము అన్నారు. రెవిన్యూ, ఎండోమెంట్ , అటవీ భూములను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆక్రమణల వెనుక ఎంత పెద్ద వ్యక్తులున్నా ఉపేక్షించమని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version