ఏపీ టీడీపీ కొత్త కమిటీ ప్రకటన..జాప్యం వెనుక బాలయ్య…!

-

ఏపి టిడిపి పార్లమెంట్ నియోజవర్గాల అద్యక్షుల ఎంపిక పూర్తి అయ్యింది. అయితే రాష్ట్ర కమిటీ ప్రకటన మాత్ర నేడు రేపు అంటూ నాన్చుతున్నారు. అంతా సిద్ధమైనా అధినేత ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇదిగో ప్రకటన…అదిగో ప్రకటన అని ప్రచారం జరుగుతుంది తప్ప…..అధినేత లిస్ట్ మాత్రం విడుదల చెయ్యడం లేదు. అయితే అంతా పూర్తియినా చంద్రబాబు ప్రకటన చెయ్యకపోవడం వెనుక బాలయ్య ప్రమేయం ఉందట. బాలయ్య సూచనమేరకు రాష్ట్ర కమిటీ ప్రకటన ఆగిందని పార్టీలో చర్చ జరుగుతుంది.


టిడిపిలో వాస్తు వ్యవహారాలు, మంచి రోజులు చూసుకునే విధానం బాగా ఎక్కవయ్యింది అనే చర్చ జరుగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గ అద్యక్షుల నియామకాన్ని కూడా ముహూర్తం చూసుకుని 11గంటల 50 నిముషాలకు విడుదల చేశారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ విషయంలో కూడా మంచి ముహూర్త కోసం వేచి చూస్తోంది అధిష్టానం. దీనికి తోడు స్వయంగా బాలయ్య మంచి రోజు పై సూచన చెయ్యడంతో కమిటీ ప్రకటన మళ్లీ వాయిదా పడిందని చెపుతున్నారు పార్టీ నేతలు. ఈ నెలలో ఇప్పట్లో మంచి రోజులు లేవని బాబుకు సూచించారట. అంతకూ ఇవ్వాలి అనుకుంటే ఈ నెల 18 తరువాత కమిటీపై ప్రకటన చెయ్యండి అని చెప్పారట నందమూరి బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version