ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్..యథావిధిగా వైన్స్‌ ఓపెన్‌ !

-

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్..యథావిధిగా వైన్స్‌ ఓపెన్‌ గానే ఉండనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో యథావిధిగానే రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు పని చేయనున్నాయి. తమ బంద్ ని నిరవధిక వాయిదా వేసుకున్నారు ఏపి బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్. వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి లేఖ అందించారు ఏపి బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్ ప్రతినిధులు.

AP Wine Shops Bandh Decision Delayed Due to Floods

ఇక వారి సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్‌ రా ష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలోనే… వివిధ సోషల్ మీడియా వేదికల్లో మద్యం దుకాణాల బంద్ వార్తలు అవాస్తవమని, యధావిదిగానే పని చేస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version