‘సంజీవని’ స్కీమ్ ప్రత్యేకతలివే.. ₹25 లక్షల హెల్త్ కవరేజ్‌తో AP ప్రజలకు బిగ్ రిలీఫ!

-

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు! ఆగస్టు నుంచి రాష్ట్రంలో ‘సంజీవని’ అనే కొత్త హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన వైద్యం పేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అసలు ఈ స్కీమ్ ప్రత్యేకతలు ఏంటి? ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరేలా తీసుకొచ్చిన ఈ పథకం వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

భారీ హెల్త్ కవరేజ్: ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. ఇక ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా లేదా అత్యవసర వైద్యం అవసరమైనా కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇస్తోంది.

అందరికీ సమాన అవకాశం: ఈ పథకం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇది వర్తిస్తుంది. ఇక ధనిక, పేద తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ఉచిత వైద్య సేవలను పొందే అవకాశం కల్పించారు.

AP's Sanjeevani Scheme Explained: Key Benefits of ₹25 Lakh Health Insurance
AP’s Sanjeevani Scheme Explained: Key Benefits of ₹25 Lakh Health Insurance

వేల సంఖ్యలో వ్యాధులకు చికిత్స: సంజీవని స్కీమ్ కింద ఏకంగా 3,257 రకాల వ్యాధులకు ఉచితంగా నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్యం అందిస్తారు. ఇక ఆసుపత్రిలో చేరినప్పుడు జేబులో రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే వైద్య సేవలు అందుతాయి.

ముందుగానే హెల్త్ చెకప్‌లు: కేవలం జబ్బు వచ్చాక వైద్యం చేయడమే కాకుండా.. అసలు అనారోగ్యాల బారిన పడకుండా ముందే గుర్తించేలా ముందస్తు టెస్టులు నిర్వహిస్తారు. అలాగే స్కీమ్‌లో ఉన్న వారందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేసి భద్రపరుస్తారు.

ఇక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ‘సంజీవని’ స్కీమ్ రాష్ట్ర ప్రజలకు నిజంగా పెద్ద ఉపశమనమే. ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం ద్వారా ఏపీలో ఉచిత వైద్య సేవలు మరింత సులభంగా, మెరుగ్గా అందనున్నాయి.

గమనిక: ఇది కేవలం ప్రభుత్వం ప్రకటించిన ప్రాథమిక సమాచారం మాత్రమే. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అప్లికేషన్ ప్రక్రియ అధికారికంగా విడుదలయ్యాక ప్రభుత్వం వెల్లడిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news