ఉత్తరప్రదేశ్ మీరట్ లో నిన్న జవాన్ ను టోల్ గేట్ వద్ద విచక్షణారహితంగా టోల్గేట్ సిబ్బంది దాడి చేసిన సంగతి తెలిసిందే. సెలవులను ముగించుకొని ఢిల్లీకి తిరిగి వెళ్తున్న జవాన్ ఆలస్యం అవుతుందని ప్రశ్నించడంతో అతనిపై టోల్గేట్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే జవాన్ ను కొట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు టోల్ ప్లాజా పైన దాడి చేశారు.

సిబ్బందిని కొట్టి అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. అంతకుముందు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన NHAI టోల్ ప్లాజా ఏజెన్సీ పై రూ. 20 లక్షల ఫైన్ విధించింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ను ఉల్లంఘించినందుకు భవిష్యత్తులో వేలంలో పాల్గొనకుండా బ్యాన్ చేసింది. మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా జవాన్ పై దాడిని తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం రాజ్ పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్ పనిచేస్తున్నారు.
జవాన్పై దాడి చేసిన టోల్గేట్ను ధ్వంసం చేసిన స్థానికులు
టోల్గేట్పై రూ.20 లక్షలు జరిమానా.. ఆరుగురు అరెస్ట్
ఉత్తరప్రదేశ్ – మేరఠ్ టోల్గేట్ వద్ద ఆర్మీ జవాన్పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన టోల్గేట్ సిబ్బంది
టోల్గేట్ నిర్వహణ భూని టోల్ ఏజెన్సీదిగా గుర్తించి కఠినచర్యలకు… https://t.co/Jn0pHaPr41 pic.twitter.com/JYUDwxDKUf
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2025