Telangana : రాష్ట్రంలో ‘ఆరోగ్య మహిళ’ పథకం ప్రారంభం

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ కానుక అందజేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించింది. కరీంనగర్​లో ఈ పథకానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.

మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకం తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ పథకంలో 8 రకాల చికిత్సలు ఉంటాయని వివరించారు. ఆరోగ్య మహిళ కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version