యూపీలో దారుణం.. భార్య పై స్నేహితులతో అత్యాచారం చేయించిన భర్త..!

-

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు భర్త. ఈ ఘటనలో నిందితురాలు కీలక విషయాలను బయటపెట్టింది. నిందితుడికి ఆమె నాలుగో భార్య. ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు డాక్టర్ గా గుర్తించారు. పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లో తన స్నేహితులతో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. గది బయట, లోపల దృశ్యాన్ని డాక్టర్ సీసీటీవీ నుండి చూస్తూనే ఉన్నాడని పేర్కొంది. అనంతరం.. డాక్టర్ తనను కొట్టాడని మహిళ ఆరోపించింది. ఈ విషయంలో పోలీసుల సహాయం కోరానని.. అయితే ఎవరూ తనకు సహాయం చేయలేదని తెలిపింది.

మీడియా కథనాల ప్రకారం.. కోల్ కతాలోని బల్లిగంజ్లో నివసిస్తున్న మహిళ, గంగో పోలీస్ స్టేషన్లోని మొహల్లా కోట్లా నివాసి డాక్టర్ అహ్బర్ హుస్సేన్తో 2022 మే 12 నుండి లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వైద్యుడు డాక్టర్ అహ్బర్ హుస్సేన్ ఆమెను, ఆమె ఏడేళ్ల కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం.. నిందితుడు డా. తన సహచరులైన డాక్టర్ షాజాద్, డాక్టర్ ఆరిఫ్లకు ఫోన్ చేసి 2023 జూన్ 21న ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను కోల్కతాలో విడిచిపెట్టారు. ఈ విషయమై దేవబంద్ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version