అనంతరపురంలో దారుణం.. శ్రీరామాలయం రథానికి నిప్పు

-

ఏపీలో ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ వివాదం నడుస్తున్న తరుణంలో మరో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనకనహాల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామాలయం రథానికి గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పుపెట్టారు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రథానికి నిప్పు పెట్టిన ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. అయితే, ఘటనా స్థలం వద్ద బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ సెంటిమెంట్లను దెబ్బతీయడానికి కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని హిందూ సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version