హిందూ ఆలయాలపై దాడులు కుట్రలో భాగమే : ఈటల

-

రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. శనివారం నేరెడ్మెట్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. తన 11 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ దేశంలో శాంతిని నెలకొల్పారని, దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉందన్నారు.కానీ, దానిని దెబ్బతీయడానికి హైదరాబాద్‌లో అశాంతిని నెలకొల్పడానికి కొందరు కుట్ర చేస్తున్నారని, అందులో భాగమే హిందూ దేవాలయాల మీద దాడులు అని పేర్కొన్నారు.

ఓట్ల కోసం సీట్ల కోసం ఇలాంటి వారిని పెంచి పోషిస్తే..పాముకు పాలు పోసి పెంచుకున్నట్టే అని గుర్తుచేశారు.ఉన్మాదానికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదన్నారు.వారికి మానవత్వం ఉండదని, అమాయకులు బలి అవుతారని చెప్పారు. ఈ ఉన్మాదం చాలా దేశాలను నిద్రలేకుండా చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకపైనా ఇలాంటి ఘటనలపై ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే మోడీ కర్తవ్యమని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version