IND VS AUS: కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫీల్డింగ్… !

-

ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్యన గౌహతి వేదికగా మరికొద్ది సేపట్లో జరగనున్న మ్యాచ్ లో టాస్ పడింది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ను ఎంచుకోవడం విశేషం. మొదటి రెండు మ్యాచ్ లలోనూ ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలు కావడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఆస్ట్రేలియా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియాను మట్టి కరిపించడానికి ఏకముగా మూడు మార్పులను కంగారు యాజమాన్యం చేసింది. గత మ్యాచ్ లో బెంచ్ కె పరిమితం అయిన హెడ్ , రిచర్డ్ సన్ మరియు బెహ్రఎండార్ఫ్ లు తుది జట్టులోకి వచ్చారు. ఇక ఇండియా జట్టులోనూ ఒక కీలక మార్పు చోటు చేసుకుంది, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ తమ పెళ్లి కావడంతో ఇతని స్థానంలో ఆవేశ ఖాన్ జట్టులోకి వచ్చాడు.

మరి ఇండియాను వరుస విజయాల నుండి ఆస్ట్రేలియా షాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. జైస్వాల్, గైక్వాడ్ మరియు కిషన్ లు రాణిస్తే ఇండియాకు తిరుగుండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version