ఏపీ టీచర్లకు సీఎం జగన్‌ శుభవార్త..సీపీఎస్ పై కీలక ప్రకటన

-

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు అవార్డు అందజేశారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా ఏపీ టీచర్లకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. పరోక్షంగా సీపీఎస్ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్.. ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్‌ విషయం మీద పూర్తి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామన్నారు. మంచి పరిష్కారం కోసం పని చేస్తున్నామని… గతంలో ఏనాడూ ఉద్యోగుల మీద సానుభూతి చూపని ప్రతిపక్షం అని తెలిపారు.

ఉద్యోగులకు మంచి చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదని.. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహించారు. ఉద్యోగులకు, వారి పెన్షన్‌కు సంబంధించి ఒక్క వ్యాక్యం కూడా రాయని, చూపని ఎల్లోమీడియా అని.. ఇప్పుడు.. పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే.. రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ గమనించాలని కోరుతున్నాను… అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర మనదన్నారు. టీచర్లకు, ప్రభుత్వ స్కూళ్లకు ఎన్నడూ లేని గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం మనదని గుర్తు చేశారు. టీచర్లకు అన్ని విధాలా మంచి చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version