మాజీ మంత్రి నారాయణకు బెయిల్ పొడిగింపు !

-

గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నారాయణ సంస్థల అధినేత పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ గా అయ్యి పురపాలక మరియు ఐటీ శాఖకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు లో అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో సీఐడీ నారాయణపై కేసును నమోదు చేసింది. కానీ నారాయణ అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా, హై కోర్ట్ కు వెళ్లి ముందస్తుగానే బెయిల్ ను తెచ్చుకున్నాడు. కాగా ఈ బెయిలు గడువును పెంచుతూ, తర్వాత విచారణను ఏప్రిల్ 10 వ తేదీకి వాయిదా వేసింది.

ఇక మళ్ళీ నారాయణ రాజకీయాల్లో కొనసాగుతారా లేదన్న ప్రశ్నకు ఇంకా క్లారిటీ లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఆలోగా చంద్రబాబు తో చర్చించి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేస్తాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version