జగన్‌ తెలంగాణకు వస్తే..పెను ప్రకంపనలే – BRSపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలనం !

-

జగన్‌ తెలంగాణకు వస్తే..పెను ప్రకంపనలే అంటూ BRSపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్న లేకపోయినా.. ఆయన అంటే, స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని తెలిపారు. ఆ దృష్టితోనే ప్రైవేట్‌ సైన్యం ఉందని, గతంలో చెప్పినట్లు వివరణ ఇచ్చారు బైరెడ్డి. తెలంగాణ లో ప్రతి గ్రామంలో కూడా జగన్‌ కు అభిమానులున్నారని వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇక్కడికొచ్చి.. ఏదో చేసేస్తుందని.. తెలంగాణ మంత్రులు కారు కూతలు కూస్తున్నారని ఆగ్రహించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఒక్కసారి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే, అక్కడి రాజకీయాలు తలకిందులు అవుతాయని హెచ్చరించాడు. అలాగే, పవన్‌ కళ్యాణ్‌ కు కూడా చురకలు అంటించారు బైరెడ్డి. పవన్‌ కళ్యాణ్‌ కు 175 నియోజక వర్గాల పేర్లు కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version