టాలీవుడ్ లో మరో విషాదం..సంగీత దర్శకుడు రఘుకుంచే తండ్రి మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

అయితే, తాజాగా టాలీవుడ్‌ సంగీత దర్శకుడు రఘు కుంచే తండ్రి మరణించారు. ఆయన తండ్రి కుంచె లక్ష్మీ నారాయణ మంగళ వారం మృతి చెందారు. ఆయన వయో వృద్ధాప్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ.. తాజాగా మరణించారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రముఖులు.. సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version