మీరు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలు… నా దగ్గర ఆధారాలున్నాయి:బలమూరి వెంకట్ రావు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై బలమూరి వెంకట్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కరోనా గురుంచి ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులిటెన్ లో అన్నీ అబద్ధాలు చెబుతున్నారని.జులై 16 వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మాత్రమే చనిపోయిన్నట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కానీ ఆ రోజు కేవలం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో 14 మంది చనిపోయారని బలమూరి వెంకట్ ఆరోపించారు.  తనవి కేవలం ఆరోపణలు మాత్రమే కావని, ఇవి నిజాలని తను చెప్పేది ఏమాత్రం అబద్ధమైన జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ప్రభుత్వాలు ఆరోగ్యం విషయంలో ఇలాంటి మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సింది కానీ ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. అలాగే జులై 17 వ తేదీ ప్రభుత్వ చెప్పిన మరణాల సంఖ్య 7 అయితే.. అదే రోజు గాంధీ ఆస్పత్రిలో పది మరణాలు సంభవించాయని బలమూరి వెంకట్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మరణాలు సంభవించినప్పటికీ ప్రభుత్వం లెక్కల దాచిపెట్టి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నేను చెప్పేవి నిజాలని.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version