జాతీయ జెండా పై బండి సంజయ్ కామెంట్స్..!

-

భారతదేశ ఆశయాలకి ఆదర్శాలకి ప్రతిరూపంగా నిలిచింది మువ్వన్నెల జెండా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామడుగు మండలం లోని గోపాలరావుపేట గ్రామంలో ప్రధాన కూడలి దగ్గర 56 ఫీట్ల భారీ జాతీయ జెండా ఆవిష్కరణ సభకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా వచ్చారు ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సభని ఉద్దేశించి మాట్లాడారు.

మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువాడే అవ్వడం ఎంతో గర్వకారణం అన్నారు మువ్వన్నెల జెండా అంత పెద్ద ఎత్తున రెపరెపలాడుతోంది అంటే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుందన్నారు బానిసత్వాన్ని ఎదిరించి గెలిచిన భారత వంటి దేశంలో జాతీయ జెండాకి ఉన్న ప్రాధాన్యత వెలకట్టలేనిది అన్నారు మన జాతీయ జెండా పవర్ ఏంటో ఉక్రేన్ యుద్ధం నిరూపించింది అన్నారు పాకిస్తాన్ కి మనతో పాటే స్వాతంత్రం వచ్చిన అక్కడ మాత్రం అంతా మిలటరీ చెప్పినట్లు పాలన కొనసాగించాల్సిందే లేకపోతే ప్రధాని అయినా దేశాధ్యక్షుడు అయినా జైల్లో వేస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version